ఆర్టీసీ ఈబస్సులో అగ్ని ప్రమాదం
- బ్యాటరీ పేలి అంటుకున్న మంటలు
- మంటల్లో కాలిపోయిన బస్సు
- డ్రైవర్ అప్రమత్తతో సురక్షితంగా బయటపడ్డ 41 మంది ప్రయాణికులు
- కరీంనగర్ పరిధిలోని అలుగునూరు వద్ద ఘటన
కరీంనగర్, జూన్ 21 (విజయక్రాంతి): కరీంనగర్ నుంచి హై దరాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులో ఆదివారం ఉదయం ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో 41 మంది ప్రయాణికులు సురక్షితం గా బయటపడ్డారు. కరీంనగర్ డిపో చెందిన ఈ-గరుడ బస్సు ఆదివారం ఉదయం కరీంనగర్ బస్టాండ్ నుంచి 41 మం ది ప్రయాణికులతో హైదరాబాద్కు బయలుదేరింది. కరీంనగర్ దాటి అలుగునూరు సమీపంలోని కాకతీయ ప్రధాన కాలువ వంతెన వద్దకు చేరుకోగానే, బ్యాటరీ ఇంజిన్ క్యాబిన్లో సాంకేతిక లోపం తలెత్తి షార్ట్ సర్క్యూట్ కారణంగా దట్టమైన పొగలు వచ్చి మంటలు చెలరేగాయి.
అయితే వెనుక వైపు నుంచి వస్తు న్న పొగలను డాష్ బోర్డ్ హెచ్చరికలను గమనించిన డ్రైవర్ ప్రశాంత్ ఆలస్యం చేయకుండా బస్సును రాజీవ్ రహదారి పక్క న నిలిపివేశారు. ప్రయాణికులను ప్రధాన, అత్యవసర ద్వారాల నుంచి కిందికి దించాడు. ప్రయాణికులంతా కిందకు దిగిన నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీ పేలడంతో మంటలు బస్సు మొత్తం వ్యాపించి పూర్తిగా కాలిపోయింది. కరీంనగర్ అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మం టలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాద ఘటనపై ఆర్టీసీ ఎండీ ఉన్నత స్థాయి సాంకేతిక విచారణకు ఆదేశించారు.






