17 April, 2026 | 2:32 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

రెనాల్ట్ ట్రైబర్ కారులో చెలరేగిన మంటలు

01-05-2025 11:21 AM

రంగారెడ్డి,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లోని ఆరంగర్ చౌరస్తా సమీపంలో పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే కింద పెను ప్రమాదం తప్పింది. గురువారం పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే కింద పిల్లర్ నెంబర్ 312 వద్ద నడుస్తున్న రెనాల్ట్ ట్రైబర్  కారులో ఒక్కసారిగా మంటలు  చెలరేగాయి. క్రమంగా మంటలు కారు మొత్తానికి వ్యాపించడంతో అందుకున్న ఉన్న నలుగురు ప్రయాణికులు బయటకి వచ్చి తమ ప్రాణాలు కాపాడుకున్నారు.

పెద్దఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డడంతో అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు  సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే కారు అగ్నికి ఆహుతైపోయింది. చార్మినార్ నుండి శంషాబాద్ వైపు కారు వెళుతున్నట్లుగా పోలీసులు విచారణలో వెల్లడైంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో పాయల్ అనే మహిళ,మరొక వ్యక్తి, ఇద్దరు పిల్లలు, ఒక పెంపుడు కుక్క కారులో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాహాని జరగలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.