23-06-2025 12:43:50 AM
- నల్లగొండ జిల్లాను వీడని నీటిభూతం
- 23 మండలాల్లో ప్రమాద ఘంటికలు
- మరోమారు ఫ్లోరైడ్ గుప్పిట చిక్కే అవకాశం ఉందంటున్న నివేదికలు
- పోరాటం ఇంకా మిగిలే ఉందంటున్న పర్యావరణవేత్తలు
- ఉపరితల నీటివనరులే శాశ్వత పరిష్కారం అంటూ సూచన
నల్లగొండటౌన్, జూన్ 22 (విజయక్రాంతి): ఉమ్మడి నల్లగొండ జిల్లా పేరు గిన్ని స్ వరల్డ్ రికార్డుల్లోకి ఎప్పుడో ఎక్కింది. ఈ రికార్డు ఏడు దశాబ్దాల కిందటు న మోదయ్యింది. అయితే అది ఓ సా నుకూల అంశంలో కాదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) నిర్దేశించిన ప్రమాణాల కంటే ఎక్కువగా నీటిలో ఫ్లోరైడ్ శాతం ఉండటంతో ఈ రికార్డు నల్గొండ పేరున రికార్డయ్యింది.
మునుగోడు నియోజక వర్గం మర్రిగూడ పరిధిలోని బట్లపల్లి అనే గ్రామంలో భూగ ర్భజలా ల్లో 10 పీపీఎం (పార్ట్ పర్ మిలియ న్) ఎక్కువే ఫ్లోరైడ్ ఉన్నట్లు గుర్తించి ఆ గ్రామం మొత్తాన్ని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత వివిధ అంతర్జాతీయ, జాతీ య సంస్థలు జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్యపై పనిచేశాయి.
ఫ్లోరై డ్ పీడనకు ఉపరితలజలాలే శరణ్యమన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వాలు ఆ దిశ లో పనిచేశాయి. తెలంగాణ ఆవిర్భా వం తర్వాత నాటి టీఆర్ఎస్ ప్రభు త్వం చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం కింద ఇంటింటికీ తాగునీరు ఇవ్వడం, మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ కింద చెరువులను పునరుద్ధరించి నీటితో నింపడంతో భూగర్భ జలమట్టాలు పెరిగి ఫ్లోరైడ్ తగ్గిపోయిందన్న అభిప్రాయానికి వచ్చారు.
ఈ మేరకు భారత పార్లమెంటు లో దేశవ్యాప్తంగా గుజరాత్, ఉ త్తరాఖండ్, తెలంగాణలను ‘ఫ్లోరైడ్ ఫ్రీ స్టేట్స్’గా 2020 సెప్టెంబర్లో ప్రకటించారు. దీంతో నల్లగొండ ఇక ఫ్లోరైడ్ పీడ నుంచి బయటపడినట్లే అని అంతా భావించారు. కానీ, తాజా అధ్యయనాలు మాత్రం ఫ్లోరిన్ రక్కసి ఇంకా పొంచి ఉందని స్పష్టం చేస్తున్నాయి.
రాష్ట్రంలో గత ఏడాది చివరలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టులు, ప్రధానంగా కొద్దిమొత్తం ఖర్చుపెడితే పూర్తయ్యి ఫలాలు అందించే అవకాశం ఉన్న ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది. వీటిలో ఉమ్మడి నల్గొం డ జిల్లా పరిధిలోని దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు ఒకటి. రెండు వారాల కిందట ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పురోగతిపై నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి సమీక్ష జరిపారు.
ఈ సమీక్షకు సాగునీటి శాఖ అధికారులు నివేదికలతో హాజరయ్యారు. వీరి నివేదికల ప్రకా రం ఉమ్మడి నల్లగొండ జిల్లా మరోమారు ఫ్లోరై డ్ గుప్పిట చిక్కే అవకాశం ఉందన్న ఆందోళనను కలిగించే విషయాలు వెల్లడయ్యాయి. నకిరేకల్ నియోజకవర్గంలోని నా ర్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామం లో భూ గర్భజలాల్లో 10పీపీఎం కంటే ఎక్కువగానే ఫ్లోరైడ్ ఉన్నట్లు గుర్తించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో 73 మండలాలు ఉండగా 23 మండలాల్లో భూగర్భజలాల్లో నిర్ణీత పరిమితి, పరిణామాల కంటే ఎక్కువశాతం ఫ్లోరైడ్ ఉన్నట్లు గుర్తించారు. నార్కెట్పల్లి, మునుగోడు మండలాల్లోని గ్రామాల్లో 5 పీపీఎం కంటే ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్నట్లు నివేదికల్లో పేర్కొన్నారు.
తగ్గినట్టే తగ్గి..మళ్లీ దాడి
జిల్లాలో నవంబర్ 2022 నాటికి యాభై శాతానికి ఫ్లోరైడ్ నిల్వలు పడిపోయాయని ప్రకటించి నిండా రెండేళ్లు నిండక ముందే తిరిగి ఫ్లోరైడ్ సమస్య తిరగబెట్టడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఫ్లోరిన్ సమస్యతో సతమతమైన 967 గ్రామాల సంఖ్య సున్నాకు చేరిందని నాటి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ చేసిన ప్రకటన ఇప్పుడు ప్రశ్నార్థకం అవుతోంది. జిల్లాలో మిషన్ కాకతీయ కింద 142 చెరువులను కూడా పునరుద్ధరించారు.
దీంతో భూగర్భ జలమట్టాలు బాగా పెరగడంతో ఫ్లోరైడ్ తగ్గిందనుకున్నారు. ఇండియన్ నేచురల్ రిసోర్స్ ఎకానమిక్ అండ్ మేనేజ్మెంట్ (ఐఎన్ఆర్ఈఎమ్) జరిపిన సర్వేలోనూ ఫ్లోరైడ్ పెరిగినట్లు గుర్తించారు. ఈ సమస్య బారినపడినవారు జిల్లాలో 1,108 గ్రామాల్లో 19లక్షలుగా ప్రభుత్వ నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. వీరికి అన్ని రకాలుగా మద్దతుగా నిలిచేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా నల్లగొండ జిల్లాలో 2013 నవంబరులోనే డిస్ట్రిక్ట్ ఫ్లోరైడ్ మానిటరింగ్ సెల్ (డీఎఫ్ఎమ్సీ) ఏర్పాటయ్యింది.
ఈ మండలాల్లో ప్రమాద ఘంటికలు..
వాస్తవానికి ఫ్లోరైడ్ సమస్య ఒక్క నల్లగొండ జిల్లాకు సంబంధించింది మాత్రమే కాదు. దేశంలో 22 రాష్ట్రాల్లోని 125 జిల్లాలు ఫ్లోరైడ్ భూతం బారిన పడినవే. తాజా నివేదికల మేరకు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 23మండలాల్లోని భూగర్భజలాల్లో ఫ్లోరైడ్ శాతాలు పెరిగాయి.
అధికారిక నివేదికల ప్రకారం.. డిండి, దేవరకొండ, చింతపల్లి, నాంపల్లి, మర్రిగూడెం, చండూరు, మునుగోడు, నారాయణపూర్, కనగల్, గుర్రంపోడు, నల్గొండ, తిప్పర్తి, నార్కెట్పల్లి, చిట్యాల కట్టంగూరు, చౌటుప్పల్, వలిగొండ, బీబీనగర్, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు తదితర మండలాల్లో భూగర్భ జలాల్లో 2 పీపీఎం నుంచి 5 పీపీఎం వరకు ఫ్లోరైడ్ శాతం ఉన్నట్లు నివేదికల సమాచారం. జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉపరితల జలాలు మాత్రమే.
మర్రిగూడెం మండలంలో తలపెట్టిన శివన్నగూడెం రిజర్వాయర్ పూర్తయ్యి అందుబాటులోకి వస్తే ఫలితాలు మెరుగుపడవచ్చు. ప్రధానంగా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గంలో శాశ్వత పరిష్కారానికి ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్ట్ పూర్తికావాల్సిందే. భూగర్భజలాలను తాగునీటికి వినియోగించినన్ని రోజులు ఈ తిప్పలు తప్పేలా లేవు.
పోరాటం ఇంకా మిగిలే ఉంది..
ఫ్లోరోసిస్పై పోరాటం ముగిసిపోలేదు. ప్రభుత్వం చూపాల్సిన స్థాయిలో శ్రద్ధ చూపడం లేదు. సురక్షితమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్ కోసం ప్రయత్నాలు చేయాలి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 59 మండలాలు 3,477 ఆవాస గ్రామాలకు క్రమం తప్పకుండా మిషన్ భగీరథ ద్వారా కృష్ణానది జలాలను తాగునీరుగా ఇవ్వాలి.
అంగన్వాడీ కేంద్రాలు, అన్నిస్థాయిల పాఠశాలలకు, హాస్టళ్లకు సరఫరా చేయాలి. ఫ్లోరోసిస్ శాశ్వత పరిష్కారం కోసం తాగునీటితోపాటు శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం పూర్తిచేసి డిండి ఎత్తిపోతల ద్వారా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని గొట్టిముక్కుల కృష్ణరాయన్పల్లి, శివన్నగూడెం ప్రాజెక్టులు సత్వరమే పూర్తిచేయాలి.
యాదాద్రి- భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని మలాపురంలో ఫ్లోరైడ్, ఫ్లోరోసిస్ మెటిగేషన్ సెంటర్ ఏర్పాటుకు చొరవ తీసుకోవాలి. పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఫ్లోరోసిస్ బాధితులకు ప్రతి నెల రూ.15 వేల పింఛన్ ఇవ్వాలి. నల్లగొండ జిల్లాలోని అన్ని వాటర్ ప్లాంట్లను మూసివేయాలి.
కంచుకట్ల సుభాశ్, రాష్ట్ర కన్వీనర్, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి