17 April, 2026 | 2:29 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

ట్రాఫిక్ నిబంధనలు పాటించండి

21-05-2025 12:00 AM

మెయిన్ రోడ్డు ఇరువైపులా దుకాణదారులకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ 

కల్లూరు, మే20 (విజయక్రాంతి)ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే ప్రమాదాలను కచ్చితంగా నివారించవచ్చని కల్లూరు ఎస్త్స్ర డి హరిత తెలిపారు. మంగళవారం పట్టణం లో ప్ర ధాన రహదారి ఇరువైపుల  ఉన్న దుకాణదారులు ఫుట్ పాత్ ఆక్రమించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు  ఉన్నాయన్నారు.  దుకాణదారులతో ప్రమాదాలు బారిన పడకుండా, వాహనాల రాక పోకలకు అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ నియమనిబంధనలు పాటించాలని వా రికి అవగాహనా కల్పించారు.

దుకాణ దారులు రోడ్డు ఆక్రమించి వస్తువులు ఏర్పాటు చేయటంతో రాకపోకలకు ఇబ్బంది కలిగి ప్రమాదాలు చోటు చేసుకుంటాయన్నారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా ఆచరించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు బే ఖాతార్ చేసినట్లైతే చట్టపరమైన చర్యలు చెప్పడతామని ఎస్త్స్ర హెచ్చరించారు.