21-08-2025 07:26:03 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని వివిధ కుటుంబాలను రాష్ట్ర మాజీ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి(Former Minister Indrakaran Reddy) గురువారం పరామర్శించారు. బీసీ సంఘ నాయకులు ఆరుమూల భాస్కర్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీధర్ తో పాటు మరో 10 కుటుంబాలను సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రదీప్ కుమార్ రమణారెడ్డి శ్రీకాంత్ యాదవ్ తదితరులు ఉన్నారు.