14-02-2026 12:35:23 AM
భీమదేవరపల్లి, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలోనీ శ్రీ త్రికుటేశ్వర ఆలయంలో నిర్వహించనున్న మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, ముల్కనూర్ సహకార సంఘం అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని ఆలయ నిర్వాహకులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జాతర కమిటీ సభ్యులు ఆయనను కలసి ఆహ్వాన పత్రిక అందజేసి, ఉత్సవాల ఏర్పాట్లు మరియు కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, శివపార్వతుల కళ్యాణం, అన్నప్రసాద వితరణతో పాటు భక్తులకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఊరడి జైపాల్ రెడ్డి, కాశిరెడ్డి ఆదిరెడ్డి, మ్యాక స్వామి తదితరులు పాల్గొన్నారు.