5 May, 2026 | 3:58 PM

బోరు బావి నుంచి ఉబికి వస్తున్న నీరు

18-03-2025 02:33 PM

బోరు బావి తవ్వించిన మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి

బైంసా,(విజయక్రాంతి): కుబీర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి మంగళవారం బోరు వేయించి తక్షణమే త్రాగునీటి సమస్యను పరిష్కరించారు. కుబీర్ లో తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న స్థానికులు మూడు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డిని కలుసుకొని విన్నవించుకున్నారు. స్పందించిన ఆయన బోరు బోరు బండి పంపించి బావి తవించడంతో భూగర్భ జలాలు ఉబికి వచ్చాయి. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.