25 July, 2026 | 5:04 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

జిల్లా గిరిజన మోర్చా మాజీ అధ్యక్షుడు మరప రాజు మృతి

25-07-2026 04:03 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా  గిరిజన మోర్చా  మాజీ జిల్లా అధ్యక్షుడు మరుపు రాజు అనారోగ్యంతో  శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ప్రధాన్ గూడ కు చెందిన ఆదివాసి గిరిజన ప్రధాన్  తెగకు చెందిన మరప రాజు బిజెపి పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ.. జిల్లాస్థాయి నాయకుడిగా  ఏదిగాడు. బిజెపి జిల్లా అధ్యక్షుడిగా , ప్రస్తుత ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మరపు రాజు బిజెపి పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడిగా నియమించారు. గత కొద్ది కాలంగా  అనారోగ్యంతో బాధపడుతూ.. ఇంటి వద్దనే ఉంటున్నారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని  మాజీ ఎంపీ , దివంగత బిజెపి  నాయకుడు రాథోడ్ రమేష్ తో పాటు ఎమ్మెల్యే పాయల శంకర్ సైతం  తమవంతుగా  ఆర్థిక సాయం అందించారు. వారి ఆర్థిక సాయంతో వైద్యం చేయించుకొని కోలుకొని  భాజపా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న సమయంలో అనారోగ్యానికి గురయ్యారు .