ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అమలు చేయాలి
25-07-2026 04:03 PM
నిర్మల్ జులై 25(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం తక్షణమే అమలు చేసి రైతులకు పంట నష్టాల నుంచి ఆర్థిక భద్రత కల్పించాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రైతులకు పంట నష్టాల నుంచి ఆర్థిక రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ప్రవేశపెట్టిందని, ప్రస్తుతం దేశంలోని అత్యధిక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమలవుతున్నప్పటికీ తెలంగాణలో మాత్రం అమలు చేయకపోవడం వల్ల రైతులు బీమా రక్షణకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కిషన్ మోర్చా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






