calender_icon.png 15 June, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.15 లక్షల నిధులతో సీసీ రోడ్లకు శంకుస్థాపన

24-05-2025 06:44:24 PM

మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి..

మనోహరాబాద్/తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి(Former MLA Narsa Reddy) శనివారం శంకుస్థాపన చేశారు.  వీరితో పాటు గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, మాజీ ఫుడ్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డిలు ఉన్నారు. 15 లక్షల ప్రభుత్వ నిధుల చేత సీసీ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రజలకు పనిచేయుటకు చిత్తశుద్ధితో ఉన్నారని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే సంకల్పం గల నాయకుడని వారన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపిటిసి ర్యాకల కృష్ణ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ చైర్మన్ విట్టల్ రెడ్డి, శోభన్ రాజ్ గౌడ్, పవన్ గౌడ్, అజయ్ గౌడ్, ఎల్ శ్రీనివాస్ గౌడ్, రాజు యాదవ్, లక్ష్మీ నరస గౌడ్, మాజీ సర్పంచ్ పెంటయ్య, అశోక్, తదితరులు ఉన్నారు.