15 April, 2026 | 11:58 AM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

అసెంబ్లీలో నాలుగు బిల్లులకు సవరణ

04-01-2026 12:55 AM

డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్క హర్షం 

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): అసెంబ్లీలో నాలుగు కీలక సవరణ బిల్లులకు అమోదం లభిం చింది. శాసన సభా సమావేశాల సందర్భంగా శనివారం  ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాగానే సభ్యు లు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు సమాధానమిచ్చారు.

ఆ తర్వాత పలువురు ఎమ్మెల్యేలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తిరస్కరించారు. ఇక బిల్లుల సవరణలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొదటగా పబ్లిక్ సర్వీసెస్ నియామకాల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, సిబ్బంది హేతుబద్ధీకరణ, వేతన నిర్మాణానికి సంబంధించిన బిల్లు  (బిల్లు నెంబర్ 6), రెండో సవరణ బిల్లు (బిల్లు నెంబర్ 7) ప్రవేశపెట్టారు.

ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్టానికి సబంధించి రెండు కీలక బిల్లులను (బిల్లు నెం.8, బిల్లు నెం9) మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు. ఈ బిల్లులపై అసెంబ్లీలో చర్చించిన అనంతరం సవరణకు సభ ఆమోదం తెలపడంతో చట్టంగా మారాయి. బిల్లుల సవరణకు ఆమోదం తెలిపిన సభ్యులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.