15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సుగ్లాంపల్లిలో ఉచిత వైద్య శిబిరంకు అపూర్వ స్పందన

25-01-2026 07:43 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు సుగ్లాంపల్లిలో సితార హాస్పిటల్ వారి సౌజన్యంతో 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈర్ల శేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంకు అపూర్వ స్పందన లభించింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో దాదాపు 200 మందికి పైగా స్థానికులు పాల్గొని వైద్య సేవలను సద్వినియోగంచేసుకున్నారు.

ఈ సందర్భంగా ఈర్ల శేఖర్ మాట్లాడుతూ... గ్రామ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత మెడికల్ క్యాంప్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్యాంప్‌లో బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ఆయన తెలిపారు.

ఈ ఉచిత మెడికల్ క్యాంప్‌ కు సహకరించిన సితార హాస్పిటల్ యాజమాన్యానికి 1వ వార్డు ప్రజల తరఫున ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈఎన్‌టీ వైద్యుడు డా. జాదవ్ రాజ్ కుమార్, జనరల్ ఫిజీషియన్ డా. సుప్రజతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు దుగ్యాల సంతోష్ రావు, తిరుపతి రావు, కలవేన రమేష్, కనుకుల సంతోష్, జంగ సతీష్, కొప్పుల నాగార్జున, అడిచర్ల పవన్, లక్ష్మీనారాయణ, పాపని సురేష్, తూడి శ్రీనివాస్, మారం అంజయ్య, చల్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.