15 April, 2026 | 12:29 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బాలేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

25-01-2026 08:01 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆసిఫాబాద్‌లోని శ్రీ పార్వతి సమేత బాలేశ్వర స్వామి వారి జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి వారిని దర్శించుకొని, ఆలయ అర్చకుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామి వారిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో గుండి సర్పంచ్ జాబరి రవీందర్, బీఆర్‌ఎస్ నాయకురాలు మర్సకోల సరస్వతి, మాజీ సర్పంచ్ బలరాం నాయక్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.