calender_icon.png 14 June, 2025 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇకపై ఆర్టీసీలో ఒకే జేఏసీ

14-06-2025 01:28:07 AM

- ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): ఆర్టీసీలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఒకే తాటిపైకి రావాలని, సమష్టి ఎజెండాతో పనిచేయాలని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న కోరారు. ఇకపై ఆర్టీసీలో ఒకే జేఏసీ ఉండాలని.. అన్ని కార్మిక సంఘాలు అదే జేఏసీ నుంచి ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని తా ము నిర్ణయించినట్లు తెలిపారు.

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం అన్ని సంఘాలతో సమావేశంలో మాట్లాడారు. అన్నీ సంఘాల కలయికతో జేఏసీ మరింతబలోపేతం అవుతుందని పేర్కొన్నారు. సమావే శంలో అశ్వథామరెడ్డి జేఏసీ తరఫున టీఎంయూకు చెందిన రాజలింగం, ఎన్‌ఎంయూ కు చెందిన కమల్‌రెడ్డి హాజరు కాగా ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ర్ట అధ్యక్షుడు రాంజనేయులు పాల్గొన్నారు.

ఎస్‌డబ్ల్యూయూ, బీఎంస్, ఎస్టీఎంయూ సంఘాలు హాజరు కానందున ఈ నెల 24న ఇక్కడే మరో సమావేశంలో అన్ని కార్మిక సంఘాలతో ఉమ్మడి ఎజెండాతో పా టుగా, సింగిల్ జేఏసీ ఏర్పాటు చేసుకొని భ విష్యత్తు పోరాట కార్యక్రమం చేపట్టాలనినిర్ణయించారు. కార్యక్రమంలో జేఏసీ కో చైర్మన్ హనుమంతు ముదిరాజ్, వైస్ చైర్మన్  థా మస్‌రెడ్డి, కన్వీనర్ మౌలానా, కో కన్వీనర్ యాద య్య, సుద్దాల సురేశ్, యాదగిరి పాల్గొన్నారు.