calender_icon.png 15 June, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ ట్యాపింగ్ కేసు.. హార్డ్ డిస్కుల ధ్వంసంపై ప్రణీత్ రావును ప్రశ్నించిన సిట్

14-06-2025 01:27:38 AM

  1. ఈరోజు మరోసారి విచారణకు రావాలని నోటీసులు

ప్రణీత్‌రావు, ప్రభాకర్‌రావులను కలిపి విచారించే అవకాశం

హైదరాబాద్,సిటీ బ్యూరో జూన్ 13 (విజయ క్రాంతి): రాష్ర్టంలో సంచలనం సృష్టిం చిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సిట్  ముమ్మరం చేసింది. ఈ కేసులో కీలక నిందితుడైన ప్రణీత్‌రావు శుక్రవారం సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ముఖ్యంగా కేసు సంబంధిత హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసిన అంశంపైనే సిట్ ప్రధానంగా ప్రణీత్‌రావును ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

గతంలోనే సిట్ కస్టడీలో ఉన్నప్పుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే తాను అదంతా చేశానని ప్రణీత్‌రావు స్టేట్‌మెంట్ ఇచ్చిన నేపథ్యంలో విచారణకు ప్రా ధాన్యత సంతరించుకుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు రాత్రి ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన పరికరాలను, హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేశారని సిట్ గుర్తించింది.

ఎస్‌ఐబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యాలయంలోనే ఈ హా ర్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసి, మూసీనదిలో పడేశారని పోలీసులు తెలిపారు. ప్రణీత్‌రా వు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానే మూసీనది నుంచి కొన్ని హార్డ్ డిస్క్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును కూడా సిట్ అ ధికారులు విచారిస్తున్నారు.

అయితే, విచారణకు ప్రభాకర్‌రావు సహకరించడం లేదని, పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారని సమాచారం. కిందిస్థాయి అధికా రులకు తాను ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆయన చెబుతున్నట్టు తెలిసింది. కానీ, ప్రణీత్‌రావుతో పాటు ఈ కేసులో అరెస్టయిన తిరుపతిరావు, భుజంగరావు, రాధాకిషన్‌రావు వంటి కిందిస్థాయి అధికారులు తమ కన్ఫెషన్ స్టేట్‌మెంట్లలో ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే పని చేశామని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యం లో, వారి స్టేట్‌మెంట్లను ప్రభాకర్‌రావు వ్యతిరేకిస్తున్నందున, ప్రణీత్‌రావును మరోసారి విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేసే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో, శనివారం మరోసారి విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు ప్రభాకర్‌రావుకు నో టీసులు జారీ చేశారు. ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావులను కలిపి విచారిస్తే మరింత సమా చారం వెలుగులోకి వస్తోందని సిట్ అధికారులు భావిస్తున్నారు.