అంత్యక్రియల ఖర్చు రూ.30 వేలకు పెంపు
03-12-2024 02:15 AM
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): ఉద్యోగుల విషయంలో రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఇచ్చే అంత్యక్రియల ఖర్చును రూ.20 వేలు ఉండగా, రూ.30 వేలకు పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి వేతన సవరణ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.






