15-01-2026 12:05:31 AM
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు: గౌరారం జగన్ గౌడ్
మేడ్చల్ అర్బన్ జనవరి 14(విజయక్రాంతి):ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గత 20 సంవత్సరాల నుండి ఒరిస్సా పరిహర్ గాయత్రి మహామంత్ర శోబ యాత్ర పూజలు నిర్వహిం చడం జరిగిందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం శోభయాత్ర పూజలో కళాశాల గంగ జలంతో గ్రామ దేవతల ఆశీర్వాదం కోరుతూ ఊరేగింపు శోభయాత్ర నిర్వహించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తుడుం రాజు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ వార్డు సభ్యులు రమేష్ యాదవ్ బిజెపి మున్సిపల్ పట్టణ ప్రధాన కార్యదర్శి కంచుగంట మహేష్, కోరుపర్తి యాదగిరి, రమేష్, ఒరిస్సా పూజారులు పనిగ్రాయ్ నిర్వాహకులు గణేష్, బృందావన్, కిషోర్ సాహు, లక్ష్మీధర్, సాహూ, నిత్యానంద్, శ్రీధర్, బాలే నాథ్, రంజాన్, భారీక్ తదితరులు పాల్గొన్నారు.