30-06-2025 02:57:28 AM
మరో మగ్గురు మైనర్లకు గాయాలు
పాపన్నపేట, జూన్ 29: కారు అదుపుత ప్పి బోల్తా పడిన ఘటనలో ఒక మైనర్ బా లిక మృతి చెందిన సంఘటన ఏడుపాయల ఆలయ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. మృతురాలు హైద్రాబాద్ లోని బే గంపేటకు చెందిన కొత్తూరి ప్రతిమ(17)గా గుర్తించారు. ఎస్త్స్ర శ్రీనివాస్ గౌడ్ కథనం ప్ర కారం వివరాలు ఇలావున్నాయి. ఫతేనగర్ ప్రాంతానికి చెందిన మైనర్ యువకుడు ప్ర తిమను ఇంట్లో వారికి చెప్పకుండా అతని స్నేహితులు మరో ఇద్దరు మైనర్లతో కలిసి శ నివారం రాత్రి ఏడుపాయలకు ఇన్నోవా కా రులో బయలుదేరారు.
అర్థరాత్రి 2 గంటల సమయంలో ఆకలి వేస్తుందని భోజనం చే యడానికి పోతంశెట్టిపల్లి వైపు వెళ్తుండగా బ స్టాండు సమీపంలోకి రాగానే కారు అతివేగంతో డివైడర్ ను ఢీ కొట్టడంతో పల్టీలు కొ ట్టి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చికి త్స నిమిత్తం క్షతగాత్రులను 108లో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ప్రతిమ అ ప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ముగ్గు రు మైనర్ యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇంట్లో తెలియకుండా తన కూ తురిని తీసుకువచ్చి ఆమె మృతికి కారణమై న సదరు మైనర్ యువకుడిపై చర్యలు తీసుకోవాలని ప్రతిమ తండ్రి అంజయ్య ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్త్స్ర పేర్కొన్నారు.