30-06-2025 02:55:22 AM
పోలీసుల ఎదుట పూర్ణచందర్ వాంగ్మూలం?
శనివారం అర్ధరాత్రి చిక్కడపల్లి ఠాణాలో లొంగుబాటు
స్వేచ్ఛ కుమార్తె వాంగ్మూలంతో పోక్సో కేసు
14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
హైదరాబాద్, సిటీ బ్యూరో జూన్ 29 (విజయక్రాంతి):ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు సంచలన మలుపు తిరిగింది. ఆమె మృతికి కారణమంటూ ఆ రోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ నాటకీయ పరిణామాల మధ్య శనివారం అర్ధరాత్రి న్యాయవాదితో కలిసి చిక్కడపల్లి పోలీసుల ఎదుట లొంగిపోయారు. “సంతోష్రావుకు అంతా తెలుసు.. ఆయనే స్వేచ్ఛను తన భర్త నుంచి విడాకులు తీసుకోమని సల హా ఇచ్చింది కూడా సంతోష్రావే.
ఆమెకు సంబంధించిన అన్ని విషయాలు సంతోష్రావుకు తెలుసు” అని పూర్ణచందర్ పోలీసు లకు ఇచ్చిన వాంగ్మూలంలో మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్రావు గురించి పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, స్వేచ్ఛ కుమా ర్తె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు పూర్ణచందర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందరే కారణమని ఆమె తండ్రి శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో గతంలో పూర్ణచందర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని స్వేచ్ఛ కుమార్తె పోలీసులకు తెలిపింది. ఈ వాంగ్మూలం ఆధారంగా చిక్కడపల్లి పోలీసులు పూర్ణచందర్పై పోక్సో చట్టంతో పాటు, నమ్మించి మోసం చేసినందుకు, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ప లు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శనివారం రాత్రే జడ్జి ముందు పూర్ణచందర్ను హాజరుపరచగా, న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది.
ఈ సందర్భంగా పూర్ణచందర్ ఇచ్చిన వాంగ్మూలం కేసు దర్యాప్తులో కొత్త కోణాన్ని వెలుగులోకి వచ్చింది. కాగా పూర్ణచందర్ మాటలు న మ్మి, అతడు పెళ్లి చేసుకుంటాడనే ఆశతో స్వేచ్ఛ తన భర్తకు విడాకులు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, విడాకుల తర్వా త స్వేచ్ఛ పలుమార్లు పెళ్లి చేసుకోవాలని నిలదీసినా, పూర్ణచందర్ మాత్రం పెళ్లి ప్రస్తావనను పదేపదే దాటవేస్తూ వచ్చాడు.
వారం రోజుల క్రితం ఇద్దరూ కలిసి అరుణాచలం వెళ్లి తిరిగి వస్తుండగా, పెళ్లి విషయంపై మరోసారి గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకోనని పూర్ణచందర్ తేల్చి చెప్పినట్లు, అంతేకాదు, నన్నేం చేయలేవు.. నాకు రాజకీయ అండదండలు ఉన్నాయి.అని స్వేచ్ఛను బెదిరించినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది. స్వేచ్ఛతో తాను రిలేషన్లో ఉన్న విషయం సంతోష్రావుకు తెలుసని పూర్ణచందర్ తన వాంగ్మూలంలో తెలిపాడు.
ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న పూర్ణచందర్ణు మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది. కాగా లొంగిపోయే ముందు పూర్ణచందర్ తన వాదనను వివరిస్తూ ఐదు పేజీల లేఖను విడుదల చేశారు. అందులో స్వేచ్ఛ మృతికి ఆమె తండ్రి చేసిన అవమానకర వ్యాఖ్యలే కారణమని ఆరోపించారు. స్వేచ్ఛ తండ్రి శంకర్ ఫిర్యాదు, కుమార్తె వాం గ్మూలం, పూర్ణచందర్ లేఖ.. ఈ మూడింటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్వేచ్ఛకు చెందిన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను స్వాధీనం చేసుకుని, కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు.