24-06-2025 12:05:08 AM
యూనిట్ అధికారులను కోరిన ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, జూన్ 23 (విజయ క్రాంతి)గిరిజన గ్రామాలలో నివసిస్తున్న గిరిజనులు వర్షాలు పడుతున్న ఎంతో నమ్మకంతో గిరిజన దర్బార్లో సమస్యలు పరిష్కరించుకోవడానికిదరఖాస్తులతో వస్తున్నందున సంబంధిత యూనిట్ అధికారులు తప్పనిసరిగా వారి దరఖాస్తులు పరిష్క రించడానికి కృషి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
సోమవారం ఐటిడిఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్ లో వివిధ గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేయాలని అన్నారు. గిరిజన దర్బార్ లో వచ్చిన అర్జీలు అన్ని ఆన్లైన్ ద్వారా ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి, అర్హులైన ప్రతి గిరిజన కు టుంబాలకు విడతల వారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు చేపడతామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలోసహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ హరీష్, ఆర్.సి.ఓ గురుకులం అరుణ కుమారి, ఎస్డిసి రవీంద్రనాథ్, ఏపీ ఓ పవర్ వేణు, డిటిఆర్ఓఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ, ఉద్యానవనాధికారి ఉదయకుమార్,మేనేజర్ ఆదినారాయణ, హెచ్ఈఓ లింగా నాయక్,మరియు ఇతర విభాగాల సిబ్బంది మమత, జోగారావు, మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.