27-12-2025 04:16:51 PM
నిర్మల్,(విజయక్రాంతి): జర్నలిస్టుల సంక్షేమం అక్రిడేషన్ల జారీకి ప్రభుత్వం విడుదల చేసిన 252 జీవోను వెంటనే సవరించి అరులైన పాత్రికేయులు అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని శనివారం డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో వల్ల పాత్రికేయులకు తీవ్ర నష్టం జరుగుతుందని పాత్రికేయులు ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం ఏవో కు వినతిపత్రం అందించారు ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పాల్గొన్నారు