22 July, 2026 | 7:11 PM

Breaking News

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పతాక స్వీకారోత్సవం కార్యక్రమం   •   సర్ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన మండల కోఆర్డినేటర్ సురభి రాజేష్   •   ఎవరెస్ట్ శిఖరంపై జెండా ఎగరాలి: కలెక్టర్ రాజర్శి షా   •   విజయ రమణారావుకు క్యాబినెట్ మంత్రి హోదాపై సంబరాలు   •   రాష్ట్ర బాధ్యతలతో సందీప్‌కు సన్మానం   •   జాతీయ పతాక గౌరవాన్ని చాటిన లయన్స్ క్లబ్ నేరేడుచర్ల   •   ప్రభుత్వ స్థలాలపై నిఘా ఉంచాలి   •   హుస్నాబాద్‌లో మూడు జిల్లాల అధికారులతో జరిగే ఎల్‌నినో సమీక్ష ఏర్పాట్ల పరిశీలన   •   గురుకులంలో గోరింటాకు సందడి   •   తాత్కాలికంగా వాయిదా పడిన కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె   •  

2017 డ్రగ్స్ కేసు.. ఆధారాలు ఏమయ్యాయి?

27-12-2025 04:15 PM

డ్రగ్స్ కేసు విచారణ ఏమైంది?

హైదరాబాద్: అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలోని నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైంది? అని కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) ప్రశ్నించారు. నాటి డ్రగ్స్ కేసులో ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయి. కేసీఆర్ కుటుంబసభ్యులూ డ్రగ్స్ తీసుకున్నారని కొందరు వాంగ్మూలం ఇచ్చారని బండి సంజయ్ గుర్తుచేశారు. నిందితుల వాంగ్మూలాలు, ఆడియో, వీడియోలు రికార్డు చేశారని చెప్పారు. నాటి డ్రగ్స్ కేసును కేసీఆర్ ప్రభుత్వం(KCR government) నీరు కార్చిందని ఆయన ఆరోపించారు.  అకున్ సబర్వాల్(Akun Sabharwal)ను డ్రగ్స్ కేసు విచారణ నుంచి తప్పించారని బండి సంజయ్ ఆరోపించారు. అకున్ సేకరించిన ఆధారాలను నాటి సీఎస్ సోమేశ్ స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. అకున్ సబర్వాల్ సేకరించిన ఆధారాలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. తక్షణమే సోమేశ్ కుమార్ ను విచారించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈగల్ బృందంలో కొందరు డ్రగ్స్ పెడ్లర్లతో రాజీపడుతున్నారని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అకున్ సబర్వాల్ కు డ్రగ్స్ కేసు విచారణ బాధ్యత తిరిగి అప్పగించాలని సంజయ్ కోరారు.