calender_icon.png 17 June, 2025 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు

13-06-2025 02:14:29 AM

వాజేడు జూన్ 12,(విజయ క్రాంతి): ములుగు జిల్లా వాజేడు మండలంలో ప్రభుత్వ పాఠశాలలు గురువారం ప్రారంభమైనాయి. వాజేడు మండల పరిధిలో ప్రాథమిక పాఠశాలలో 30, ప్రాథమికోన్నత పాఠశాలలో 8, హై స్కూల్ 2, ఆశ్రమ పాఠశాలలు 2, గిరిజన ప్రాథమిక పాఠశాలలు 11, కస్తూర్బా గాంధీ పాఠశాల 1, మినీ గురుకులం 1 చొప్పున మొత్తం మండలంలో 55 విద్యాలయాలు ఉన్నాయి.

ఈ విద్యాలయాలలో నూతనంగా ప్రవేశ పొందిన విద్యార్థులు, గత సంవత్సరం నుండి పాఠశాలకు వచ్చు విద్యార్థులు క్రొత్త ఉత్సాహంతో పాఠశాల ను అలంకరించుకొని హాజరైనారు. కాగా వాజేడు మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వాజేడు నాగారం వేసవి సెలవుల అనంతరం గురువారం పునః ప్రారంభమైంది.

ఈ పాఠశాల పరిధిలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఈనెల ఆరవ తేదీ నుండి కొనసాగుతూ జూన్ 19 వరకు నూతన ప్రవేశాలకు కార్యక్రమం జరగనుందని ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు. కాగా కొత్త విద్యా సంవత్సరం పునః ప్రారంభం సందర్భంగా వాజేడు నాగారం ఉన్నత పాఠశాలలో రంగుల ముగ్గులతో, మామిడి తోరణాలతో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు స్వాగతం పలకడం గమనార్హం.

ములుగు జిల్లా విద్యాశాఖ తరఫున జిల్లా అధికారులు పాఠశాలను సందర్శించి పాఠశాల పరిసరాలను వశతులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్, జిల్లా విద్యాశాఖ సమన్వయకులు అర్షం రాజు, గుల్లపెల్లి సాంబయ్య చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటను విజయవంతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు అధికంగా నమోదు చేయాలని అన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రమైన పరిసరాలలో మధ్యాహ్నం భోజనం పండించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోయం ఆనందరావు, ఉపాధ్యాయులు పోరిక స్వరూప్ సింగ్, చల్లగురుగుల మల్లయ్య, వెంకటరమణ, రంగు ఆనందు, పోరిక రవికుమార్, శ్రీకాంత్, బొగ్గం కుమార్ బాబు, కంచు ప్రభాకర్, తెల్లం రాజ్యలక్ష్మి, షిండే రాజేష్, కోకిల శ్రీరంగం, అమ్మాజీ రాణి, తదితరులు పాల్గొన్నారు.