07-06-2025 12:24:27 AM
మేడ్చల్, జూన్ 6 (విజయ క్రాంతి): మల్కాజిగిరి నియోజకవర్గంలో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. మచ్చ బొల్లారం డివిజన్ కు చెందిన స్వప్న రెడ్డికి 8500, నరేందర్ కు 60000, సక్సేనాకు 25000, అల్వాల్ డివిజన్ కు చెందిన మల్లేష్, అనిత , వెంకటాపూర్ డివిజన్ కు చెందిన విగ్నేశ్వర కు 60000 చొప్పున మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
వీరు అనారోగ్యానికి గురై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. సీఎంఆర్ఎఫ్ కింద నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి సిఫారసు చేయగా నిధులు మంజూరయ్యాయి. ఈ కార్యక్రమంలో ఆల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, బీ ఆర్ ఎస్ నాయకులు అనిల్, కిషోర్ గౌడ్, డోలి రమేష్, ఢిల్లీ పరమేష్ పవన్, ప్రశాంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, జావిద్ తదితరులు పాల్గొన్నారు.