5 May, 2026 | 7:07 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వాలు విఫలం

18-07-2025 12:00 AM

ఆవునూరి మధు    

ఇల్లెందు, జులై 17,(విజయక్రాంతి): రాష్ట్రంలో రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫల మయ్యాయని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవునూరి మధు అన్నారు. గురువారం ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల గోదాం రైతుల పడుతున్న ఇబ్బందులపై వ్యవసాయ అనుబంధ సంఘం డి.ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.

రైతులకు యూరియా వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇల్లెందు మండల పరిధిలో దాదాపు 34 వేల ఎకరాల్లో మొక్కజొన్న వేస్తారని దానికి సరిపడా యూరియా అందించాలని, మండల పరిధిలో కొమరారం, చల్ల సముద్రంలో ఎరువుల గోడౌన్ ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు ఎరువులను పూర్తిస్థాయిలో సరఫరా చేయకపోతే రాష్ట్రంలో జరిగే మంత్రుల పర్యటన కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

ప్రస్తుతం ఇల్లెందు పర్యటనకు వస్తున్న ఇద్దరు మంత్రులను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు మధు తెలిపారు. ఈ కార్యక్రమంలోన్యూడెమోక్రసీ అనుబంధ వ్యవసాయ సంఘం నాయకులు దుబ్బాకుల ప్రసాద్, ఎట్టి నరసింహారావు పాల్గొన్నారు.