09-04-2025 02:02:27 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 8, (విజయ క్రాంతి): జీవో 51ని సవరించాలని, గ్రామపంచాయతీ సిబ్బందికి నెలకు 18 వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని, 10 లక్షల బీమా, ఇతర సౌకర్యాలు కల్పించాలని లేనిపక్షంలో ఏప్రిల్ 19 తర్వాత తాము విధులు బహిష్కరించి సమ్మె చేస్తామని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు సమ్మె నోటీసు ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల పరిషత్ కార్యాలయంలో అధికారికి ఆ సంఘం నాయకులు బండ్ల అప్పి రెడ్డి రాములు ప్రసాద్ యాక లక్ష్మి తదితరులు సమ్మె నోటీసు అందజేశారు.