09-04-2025 02:02:52 AM
జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
కోదాడ, ఏప్రిల్ 8, కోదాడ ప్రాంతీయ వైద్యశాల ద్వారా రోగులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. మంగళవారం కోదాడ ప్రాంతీయ వైద్యశాలను వారు సందర్శించి మాట్లాడారు.
త్వరలో సీటీ స్కాన్ సౌకర్యం అందుబాటులోకి తెస్తామన్నారు. అన్ని వార్డులను కలియ తిరిగి అక్కడ పేషెంట్లకు అందుతున్న వైద్యం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనం తరం వైద్యశాల పరిసరాలను, 100 పడకల వైద్య శాల నిర్మాణం చేసే స్థలాన్ని పరిశీలించారు. అధికారులు వెంకటేశ్వరరావు, జైపాల్ రెడ్డి, ఆర్డీఓ సూర్యనారాయణ, తహశీల్దార్ వాజిద్ అలీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.