12 June, 2026 | 2:51 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

పంచాయతీ పోరు: 9 గంటల వరకు 19.58 శాతం పోలింగ్

11-12-2025 10:13 AM

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల(Telangana Gram Panchayat Elections ) తొలి దశ పోలింగ్ ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 19.58 శాతం పోలింగ్(Polling Percentage) నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 3,834 సర్పంచ్ స్థానాలకు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. మొత్తం 37,562 పోలింగ్ కేంద్రాలలో 56,19,430 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించబడతాయి.