9 April, 2026 | 5:38 PM

Breaking News

108 అంబులెన్స్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆడిట్ సూపర్‌వైజర్‌   •   కాంగ్రెస్ గ్యారంటీల అమలు ఎక్కడ?   •   మంగ్యాతండా పాఠశాలలో సరస్వతి విగ్రహం ఆవిష్కరణ   •   అల్లు అర్జున్ బర్త్‌డేకు ఆరోగ్య కానుక   •   ప్రవేట్ పాఠశాలలో దారుణం   •   ఢిల్లీకి నితీష్ కుమార్— బీహార్ కొత్త ముఖ్యమంత్రి సమ్రాట్‌ అంటూ పోస్టర్లు   •   దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •  

పంచాయతీ పోరు: 9 గంటల వరకు 19.58 శాతం పోలింగ్

11-12-2025 10:13 AM

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల(Telangana Gram Panchayat Elections ) తొలి దశ పోలింగ్ ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 19.58 శాతం పోలింగ్(Polling Percentage) నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 3,834 సర్పంచ్ స్థానాలకు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. మొత్తం 37,562 పోలింగ్ కేంద్రాలలో 56,19,430 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించబడతాయి.