17 April, 2026 | 11:57 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

హనుమాన్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ

09-06-2025 01:07 AM

పటాన్ చెరు, జూన్ 8 : గడ్డపోతారు మున్సిపాలిటీ పరిధిలోని మాదారంలో 33 అడుగుల పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణానికి  గ్రామస్తులు ఆదివారం భూమిపూజ చేశారు.   రామాలయం ఆవరణలో పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణంచే స్థలంలో భూమిపూజ అనంతరం హోమం నిర్వహించారు.  33 అడుగుల పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణం  సందర్భంగా నిర్వహించిన భూమిపూజ కార్యక్రమం పండగను తలపించింది.

గ్రామ తాజీమాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు, గ్రామస్తులు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్,  కలాల్ రాజు గౌడ్, స్వామి రాజ్, బీజేపీ మండల అధ్యక్షులు జగన్ రెడ్డి,  రాష్ట్ర బీఆర్‌ఎస్ యువనేత  మాణిక్ యాదవ్,  యువకులు, గ్రామస్తులు తదితరులుపాల్గొన్నారు.