12 March, 2026 | 9:23 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపనకై స్థలం చదును పనుల ప్రారంభం

14-11-2025 11:46 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని రెడ్లరేపాక గ్రామం పరిధిలో గల మణిగండ్ల గుట్టపైన నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల శంకుస్థాపన కోసం శుక్రవారం స్థలాన్ని చదును చేసే పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి మాట్లాడుతూ... భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చొరవతో మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం కోసం త్వరలో శంకుస్థాపన చేయనున్నారని అన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల పూర్తయినట్లయితే ఈ ప్రాంతంలోని ఎంతోమంది పేదలకు నాణ్యమైన సాంకేతికమైన ఉన్నతమైన విద్యను అందించే అవకాశం ఉంటుందన్నారు.