calender_icon.png 18 June, 2025 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హక్కుల కోసం కొట్లాడే ఎఐటియుసిని విమర్శించడం సిగ్గుచేటు

17-06-2025 09:07:22 PM

ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ..

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కార్మికుల ఆకుల సాధన కోసం నిరంతరం ఉద్యమించే ఏఐటియుసిని ఐఎన్టియుసి నాయకులు విమర్శించడం సిగ్గుచేటని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ(AITUC Branch Secretary Satyanarayana) అన్నారు. మంగళవారం ఏరియా వర్క్ షాప్ లో నిర్వహించిన గేట్ మీటింగ్లో కార్మికులనుదేశించి ఆయన మాట్లాడారు. కార్మికుల ఆధరాభిమానాలు కోల్పోయిన ఐఎన్టియుసి నాయకులు ఏఐటీయూసీ యూనియన్ ను విమర్శిస్తే కార్మికులు సహించరని ఆయన స్పష్టం చేశారు. 

గనులు కార్మిక ఉపాధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇటీవల పట్టణానికి వచ్చిన మంత్రి డాక్టర్ వివేక్ వెంకట స్వామి(Minister Dr. Vivek Venkata Swamy)ని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి కార్మికుల చిరకాల స్వప్నం అయిన సొంత ఇంటి కల, పేర్క్స్ పైన ఇన్కమ్ టాక్స్ రద్దు చేయాలని మంత్రి దృష్టికి తీసుకుపోగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.

దీనిని జీర్ణించుకోలేని ఐఎన్టియుసి నాయకులు తమ ఉనికి కోసం ఏఐటియుసిపై బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. ఐఎన్టీయూసీ నాయకులు విమర్శలు మాని కార్మికుల సమస్యల సాధనపై దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఏరియా ఉపాధ్యక్షులు భీమనాదుని సుదర్శన్, సంయుక్త కార్యదర్శి కంది శ్రీనివాస్, వర్క్ షాప్ ఫిట్ కార్యదర్శి ప్రభాకర్ శర్మ, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ ముల్కలపల్లి వెంకటేశ్వర్లు, తోట వెంకట స్వామి, ఏరియా నాయకులు సోమిశెట్టి రాజేషం, ఎగేటి రాజేశ్వర్ రావ్, పెద్దపల్లి బాణయ్య, టేకుమట్ల తిరుపతి, పిట్ సెక్రటరీలు గాండ్ల సంపత్, మర్రి కుమార్, కే ఓదేలు, కలువల శ్రీనివాస్, పారిపెల్లి రాజేశం, కన్నం వేణు, వర్క్ షాప్ ఉద్యోగులు పాల్గొన్నారు.