ఉత్తమ ప్రధానాచార్యుగా గుండేటి కోటేశ్వరరావుకు సన్మానం
27-05-2026 03:27 PM
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): శ్రీ సరస్వతీ విద్యా పీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్లో మే 27, 28 తేదీలలో నిర్వహిస్తున్న వర్షారంభ సమావేశాల్లో భాగంగా 10వ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానాచార్యులను ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా ఆసిఫాబాద్కు చెందిన శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఉన్నత పాఠశాల ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావును ప్రాంత సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్ శాలువా, ప్రశంసా పత్రంతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రాంత అధ్యక్షులు ప్రొఫెసర్ తక్కళ్ళపల్లి తిరుపతిరావు, ప్రాంత కార్యదర్శి అనఘా వెంకటలక్ష్మి, దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షులు చామర్తి ఉమా మహేశ్వరరావు, లింగం సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






