calender_icon.png 7 September, 2025 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ ఉపాధ్యాయులుగా గురుశిష్యులు

05-09-2025 12:31:51 AM

నాగల్ గిద్ద, సెప్టెంబర్ 4: భారత రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకొని నిర్వహించే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా నాగలిగిద్ద మం డలం కారాముంగి గ్రామానికి చెందిన గు రుశిష్యులు అనంత్ కుమార్, సూర్యకాంత్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎం పిక చేసినందుకు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

 భారత రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకొని నిర్వహించే జాతీయ ఉపాధ్యాయ ది నోత్సవ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు గా నాగలిగిద్ద మండలం కారాముంగి గ్రామానికి చెందిన గురుశిష్యులు అనంత్ కుమార్, సూర్యకాంత్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసినందుకు ఉపాధ్యా యులు హర్షం వ్యక్తం చేశారు.

కా రముంగి గ్రామానికి చెందిన అనంత కు మార్ 1989 సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తి ప్రవేశించి 1990 సంవత్సరంలో సూర్యకాంత్ నాలుగవ తరగతి చదువుతు న్న సందర్భంగా అనంత కుమార్ సూర్యకాంత్ కి పాఠాలు చెప్పడం జరిగింది ప్ర స్తుతం షాపూర్ ఎల్‌ఎఫ్‌ఎల్, ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంగా కొనసాగుతున్నారు.

కారముంగి గ్రామానికి చెందిన సూర్యకాంత్ 2008 సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి ఎంతో మంది విద్యార్థులకు విద్యా పట్ల అవగాహన కల్పించి ఉన్నతులుగా తీర్చిదిద్దతగా ఆయన సేవలను గుర్తించి జిల్లా విద్యాశాఖ సెప్టెంబర్ 5న సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరి యంలో జరిగే కార్యక్రమంలో తన గురువు అయినటువంటి అ నంత కుమార్ తో పాటు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డుకు ఎంపిక కావడం తో సూర్యకాంత్ ఆనందం వ్యక్తం చేశారు.  ప్రస్తుతం డిప్యూటేషన్ పై శాంతినగర్ తండాలో ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారు.