23-05-2025 12:00:44 AM
హైదరాబాద్,మే 22 (విజయక్రాంతి): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మాజీ మంత్రి హారీశ్ రావు భేటీ అయ్యారు. కాళేశ్వరంపై కమీషన్ నోటీసుల ఇచ్చిన నేపథ్యంలో గురువారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ ఇద్దరు భేటీ అయ్యారు. నోటీసుల తదుపరి కార్యాచరణపై నేతలిద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు 15 రోజుల్లోగా కమీషన్ ఎదుట హాజరుకావాలని పేర్కొన్న విషయం తెలిసిందే.