13-02-2026 12:00:00 AM
రేవల్లి ఫిబ్రవరి 12: మండల కేంద్రానికి కూతవేటు దూరంలో వడ్దేగేరి ప్రాంతానికి వె ళ్లే చెరువు కట్ట రహదారి ప్రస్తుతం మృత్యుపాశంగా మారింది. చెరువు కట్టపై వేసిన సిమెంట్ రోడ్డు భారీ పగుళ్లతో విడిపోయి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. రోడ్డుకు ఆనుకుని లోతైన చెరువు ఉ న్నప్పటికీ, కనీసం రక్షణ సూచనలు లేకపోవడం గమనార్హం. రాత్రి వేళల్లో ఈ పగుళ్లు కనిపించక వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఏమాత్రం అదు పు తప్పినా వాహనాలు నేరుగా చెరువులోకి వెళ్లే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, ఏదైనా ప్రాణనష్టం జరగకముందే రోడ్డుపై తగిన చర్యలు తీసుకోవా లని వడ్దేగేరి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.