12 June, 2026 | 5:31 PM

Breaking News

విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   •   వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •  

ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని ఇల్లు దగ్ధం

05-12-2025 09:09 AM

రెండు లక్షల ఆస్తి నష్టం

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని పెద్ద సిద్దాపూర్ గ్రామానికి చెందిన సిడం రవి ఇంటికి ప్రమాద వసత్తు  నిప్పు అంటుకొని ఇల్లు దగ్ధం అయినట్లు బాధితులు తెలిపారు. ఇంట్లో పెట్టుకున్న దీపం గాలికి మంటలు చెలరేగడంతో ఇంటికి మంటలు అంటుకోవడంతో ఇంట్లోని బీరువాలో దాచుకున్న 50వేల నగదు, బంగారం, వరి ధాన్యం,ఇంట్లోని సామాగ్రి సైతం కాలిపోయినట్లు బాధితుడు తెలిపారు. ఇట్టి విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ పోర్తేట్టి రవి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇట్టి విషయమై అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. రెండు లక్షల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు.