30-05-2025 12:23:19 AM
మహబూబ్ నగర్ మే 29 (విజయ క్రాంతి) : రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ , ట్రిపుల్ ఐటీ కళాశాల ను మహబూబ్ నగర్ జిల్లా లో ఏర్పాటు చేసినందుకు గాను ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసం లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి, వాకిటి శ్రీహరి, డాక్టర్ చిట్టెం పర్ణికా రెడ్డి, తూడి మేఘా రెడ్డి, వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.