01-12-2025 08:57:33 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): దహెగాం మండలం హాత్తిని గ్రామానికి చెందిన సేగం రాకేష్, భారతి, బండి సాయి రాజ్, పెద్దల సుదర్శన్, అరిగాల రవితో పాటు సుమారు 100 మంది దండవిటల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల నమ్మకం పెంచుకుని భారీగా కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామారావు, మండల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.