l కొండ సంగీతరెడ్డి
పరిగి, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): పరిగి నియోజకవర్గంలో బీజేపీ భారీ మెజార్టీ సాధిస్తుందని చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్రెడ్డి సతిమణి కొండ సంగీతరెడ్డి అన్నారు. ఆది వారం పరిగి మండల పరిధిలోని ఇబ్రహీంపూర్, గడిసింగపూర్, పరిగి మున్సిపల్లోని తొమ్మిదో వార్డు, మున్నూరు వాడలో 15వ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ పరిగి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడంలో స్థానిక నాయకులు వైపల్యం చెందరని ఆరోపించారు. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఇబ్బందులతో ప్రజలు కొట్టు మిట్టాడుతున్నారని తెలిపారు. ప్రజలకు మేలు జరుగలంటే బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.