04-06-2025 12:48:07 AM
మునిపల్లి, జూన్ 3 : కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్ద గోపులారం గ్రామంలో మంగళవారం నాడు చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి మునిపల్లి ఎస్త్స్ర రాజేష్ నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్ద గోపులారం గ్రామానికి చెందిన బేగరి రమేష్ (40) కోహిర్ మండలం బిలాల్పూర్ గ్రామానికి చెందిన బేగరి అనిత (30)ను గత 13 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.
వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం కలిగారు. కాగా రమేష్కు తన భార్య అనితపై అనుమానంతో గత మూడు నెలల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో భార్యాభర్తలు ఇద్దరు తనకు తానుగా ఐరన్ రాడ్ కు చున్నీతో అనిత, అదే రాడ్ కు తాడుతో రమేష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్తో పాటు కొండాపూర్ సిఐ వెంకటేశం, మునిపల్లి ఎస్త్స్ర రాజేష్ నాయక్, సిబ్బందితో చేరుకొని పరిశీలించారు.
దంపతుల ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల బంధువులు గుడిపల్లి నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు మునిపల్లి ఎస్త్స్ర రాజేష్ నాయక్ తెలిపారు. వారి ముగ్గురు పిల్లలుఅనాథలయ్యారు.