21-09-2025 08:45:11 AM
హైదరాబాద్: నగరంలోని గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. 100 ఎకారలకుపైగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. సర్వే నంబర్ 397లో 60 నుంచి 70 గజాల్లో అక్రమ ఇళ్లను నిర్మించి రూ.10 లక్షల చొప్పున విక్రయిస్తున్నారని హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలో దిగిన హైడ్రా ఆక్రమణదారుల చేతుల్లో నుంచి రూ.4500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నారు.