calender_icon.png 16 June, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్లపై మౌనమెందుకు?

15-06-2025 12:47:31 AM

- గోదావరి నీళ్లను అక్రమంగా తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు

- రేవంత్ సర్కార్, కేంద్రమంత్రులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు

- రాష్ట్రప్రభుత్వానికి ప్రతిపక్షాల మీద ఇరిటేషన్ తప్ప, ఇరిగేషన్ మీద దృష్టి లేదు

- బనకచర్లను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ ముందుకురావాలి

- లేకుంటే మేమే న్యాయ పోరాటం చేస్తాం

- బనకచర్లపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో హరీశ్‌రావు

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): గోదావరి జలాలను బనకచర్ల ద్వారా తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలోని తెలంగాణకు చెందిన మంత్రులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి, నష్టం పూర్తిగా జరగకముందే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అడ్డు కోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఏ విధమైన పోరాటానికైనా తాము ప్రభుత్వంతో కలిసి వస్తామన్నారు.

అసెంబ్లీలో తీర్మానం చేసినా సహకరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభు త్వం, బీజేపీ ముందుకు రాకపోతే తాము ప్రజాపోరాటానికైనా, న్యాయపోరాటానికైనా శ్రీకారం చుడతామని ఆయన తెలిపారు. రా ష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాల మీద ఇరిటేషన్ తప్ప, ఇరిగేషన్ మీద దృష్టి లేదని, రాష్ర్ట ప్రయోజనాలు పదవుల కోసం తాకట్టు పె డుతున్నారని మండిపడ్డారు. బనకచర్ల ప్రాజె క్ట్ పేరుతో ‘ఏపీ చేస్తున్న జలదోపిడీ- మౌనం’ అనే అంశంపై హరీశ్‌రావు శనివారం తెలంగాణభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ ప్రాజెక్టుపై అనేక అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో జలదోపిడీ జరిగినట్లు, గోదావరి జలాలను బనకచర్ల ద్వారా ఏపీ దోపిడీ చేస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మౌనంగా ఉంటున్నారని, కేటీఆర్ మీద, బీఆర్‌ఎస్ నేతల మీద అక్రమ కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారని ఆయన మండిపడ్డారు. ఏపీ అక్రమ ప్రాజెక్టు కడుతుంటే ప్రభుత్వం మౌనం వెనుక ఉన్న కార ణం ఏంటని ప్రశ్నించారు.

గోదావరి బనకచర్లకు టెండర్లు పిలుస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదని, కృష్ణా నీళ్లు తాత్కాలిక ఒప్పందానికి మించి ఏపీ తీసుకుపోతున్నా, గోదావరి నదిలో తెలంగాణకు ద్రోహం తలపెడుతున్నా ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. నిధులు, నదులు రెండు ఆంధ్రా కే వెళ్తున్నాయని, ఇద్దరు కేంద్రమంత్రుతో పాటు తెలంగాణ బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా నిధుల్లో, నదుల్లో అన్యాయం జరిగినా ఎందుకు మాట్లాడటం లేదన్నారు. 2టీఎంసీల బాబ్లీ ప్రాజెక్టు కోసం మహారాష్ర్ట మీద చంద్రబాబు పెద్ద పోరా టం చేశారని, ప్రస్తుతం 200 టీఎంసీల బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ర్ట ప్రభుత్వం ఎంత పోరాటం చేయాలని ఆయన ప్రశ్నించారు.

రేవంత్‌రెడ్డి ఎందుకు ఒక్క మాట మాట్లాడ టం లేదని, మీ దోస్తానా కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడతారా అని ఆ యన విమర్శించారు. తెలంగాణ కంటే పది రెట్ల నిధులు ఆంధ్రాకు ఇచ్చామని స్వయం గా కేంద్రమంత్రి బండి సంజయ్ ఆంధ్రాలో చెప్పారని, కేంద్రంలో పరపతితో చంద్రబాబు పై నుంచి కాకుండా పోలవరం నుంచి నీళ్లు మళ్లించి కేంద్రం నుంచి నదుల అనుసంధానం పేరుతో నిధులు తెచ్చుకుంటున్నా రని, అయినా రేవంత్‌రెడ్డికి, మంత్రులకు కదలిక లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ర్ట ప్రయోజనాలు తాకట్టు పెట్టొద్దని, రేవంత్‌రెడ్డి చిల్లర రాజకీయాలు బంద్ చేయాలని హితవు పలికారు. 

త్వరలోనే కాళేశ్వరం గురించి ప్రజలకు వివరిస్తాం: మీడియాతో చిట్‌చాట్‌లో హరీశ్‌రావు

త్వరలోనే కాళేశ్వరంలో ఉన్న అన్ని విభాగాల దగ్గరకు వెళ్తామని, ప్రజలకు అన్ని విషయాలను వివరిస్తామని మీడియా చిట్‌చాట్‌లో హరీశ్‌రావు తెలిపారు. గోదావరి పరి వాహక రైతులు, ప్రజలతో కలసి తెలంగాణకు అన్యాయం చేసే బనకచర్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు.

సీఎం కాళేశ్వరం మీద డాక్యుమెంట్లు బయటపెడితే నిమిషాల వ్యవధిలో తాను డాక్యుమెంట్లు బయటపెడతానని హరీశ్‌రావు చెప్పారు. బనకచర్లపై బీజేపీ మాట్లాడదని, ఎన్డీయే చంద్రబాబుపై ఆధారపడిందని ఎద్దేవా చేశారు. అపెక్స్ కౌన్సిల్‌పై నిర్ణయం తీసుకునేది సీఎం కాబట్టి తన పోరాటం సీఎంపైనే అని అన్నారు. గురుదక్షిణగా చంద్రబాబుకు, బనకచర్లపై సీఎం రేవంత్ మాట్లాడటం లేదని ఆరోపించారు. తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడితే రేవంత్ తెలంగాణలో చరిత్రహీనుడిగా మిగిలిపోతారని అన్నారు.  

మంత్రి ఉత్తమ్‌కు కౌంటర్

బనకచర్లపై తాను ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినందుకైనా జలశక్తి మంత్రికి నిన్ననే రాసిన ట్లు నేడు(శనివారం) లేఖ విడుదల చేసినందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ధన్యవాదాలు అంటూ హరీశ్ రావు శనివారం ఎక్స్‌లో  ట్వీట్ చేశా రు. గతంలో తాను ప్రెస్‌మీట్ నిర్వహించిన సందర్భంలోనూ ముందు డేట్ వేసి మీడియాకు లేఖ విడుదల చేశారని ఆయన తెలిపారు. లేఖలు రాసి మీడియాకు ఇవ్వడం కాకుండా చిత్తశుద్ధి ఉంటే సీఎంను బనకచర్ల విషయంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు డిమాండ్ చేయాలన్నారు.