09-01-2026 12:58:46 AM
1444 గజాల పార్కు చుట్టూ హైడ్రా ఫెన్సింగ్
సికింద్రాబాద్ జనవరి 8 (విజయ క్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఓల్ ఆల్వాల్ పరిధి, జొన్నబండలోని ఎంహెచ్ఆర్ కాలనీలో పార్కును హైడ్రా గురువారం కాపాడింది. 1444.40 గజాల పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసింది. లే ఔట్ ప్రకారం సర్వే నంబర్లు 575, 576 (పార్ట్), 577, 578 (పార్ట్), 598 మరియు 580 (పార్ట్)లలో మొత్తం 1444.40 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. దీనిని ఆక్రమించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యా దు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులతో క్షేత్ర స్థాయిలో హైడ్రా పరిశీలించింది. చెత్త వేయకుండా పార్కుగా అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీని కోరుతామన్నారు.