11-01-2026 12:00:00 AM
పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు
ఇన్చార్జిగా నియమించినందుకు పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపిన వెలిచాల
హర్షం వ్యక్తం చేసిన నాయకులు
కరీంనగర్, జనవరి 10(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా వెలిచాల రాజేందర్ రా వు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహా రాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేసి నియామక పత్రా న్ని వెలిచాలకు అందజేశారు.
ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాం ధీ, సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు కరీంనగర్ కాంగ్రె స్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకొస్తానని పేర్కొన్నారు.
రాబో యే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సైనికుడి వలె కష్టపడి పార్టీ జెండా ఎగరవేయడ మే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. ప్రతి పల్లె పల్లెనా, ప్రతి వార్డు వార్డునా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముం దుకు వెళ్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి కరీంనగర్ కార్పొరేషన్పై పార్టీ జెండా ఎగరవేస్తామని రాజేందర్రావు ధీమా వ్యక్తం చేశారు.కాగా రాజేందర్రావు నియామకం పట్ల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.