27-05-2025 12:31:58 AM
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
సరస్వతి పుష్కరాలకు అనుచరులతో కలిసి వెళ్లిన ఎమ్మెల్యే
కామారెడ్డి, మే26(విజయ క్రాంతి) కార్యకర్తల కష్టం వల్లనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. కష్టమైనా సుఖమైన కార్యకర్త లే తన కుటుంబ సభ్యులను అన్నారు. సోమవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు 150 వాహనాల్లో తన అనుచరులు 800 మంది తో కలిసి సరస్వతి పుష్కరాలకు బయలు దేరారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్త ఆనందమే నా జీవితం. కార్యకర్త చిరునవ్వే నా ఆనందమయం. అంటూ సమయం సందర్భం కలిసొచ్చినప్పుడు కార్యకర్తలతో కలిసి మెలసి తిరగడం వారిలో మరింత ఉత్సవం, విశ్వాసం, నమ్మకం వారిలో కల్పించేందుకు ప్రతి కార్యక్రమంలో నాయకులు కార్యకర్తల తో కలిసి ప్రయాణం కొనసాగించాలన్న తపన తాపత్రయంతో ఎల్లారెడ్డి నియోజకవర్గం కార్యకర్తలు నాయకులతో కలిసి కాలేశ్వరం సరస్వతీ పుష్కరాలకు ఉదయం 150 వాహనాల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు బయల్దేరి వెళ్లారు.
ఈ సందర్భంగా విజయక్రాంతి ప్రతినిధితో ఫోన్లో మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పై విధంగా మాట్లాడారు. మంచైనా చెడు అయిన కార్యకర్తలకు అండగా నిలుస్తానని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి, గాంధారి, నాగిరెడ్డిపేట్,లింగంపేట్, రామారెడ్డి,సదాశివ నగర్, తాడ్వాయి, రాజంపేట మండలాల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు నాపై చూపుతున్న అభిమానం ప్రజలు పెద్ద ఎత్తున సరస్వతీ పుష్కరాలకు తరలి రావడం నేను అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు.
ఆయనతోపాటు ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రాంరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, సామెల్, లింగంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నారా గౌడ్, సదాశివ నగర్ మండల కాంగ్రెస్ నాయకులు సంగారెడ్డి, లింగ గౌడ్, ఎర్రవాటి లింగారెడ్డి, గాంధారి మండల కాంగ్రెస్ నాయకులు తూర్పు రాజులు, లైను రమేష్, గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ పరమేష్, లింగంపేట్ తదితర మండలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.