27-05-2025 12:29:44 AM
- పిడుగుపాటుకు జోడెద్దులు మృతిచెందగా బాధితుల రైతుకు రూ. 64 వేల పరిహారం చెక్కును అందజేసిన ఎమ్మెల్యే
చొప్పదండి, మే26(విజయక్రాంతి): గం గాధర మండలం కాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దేశెట్టి వీరమల్లయ్య అనే రైతుకు చెం దిన రెండు ఎడ్లు రెండు రోజుల క్రితం పిడు గు పడడంతో మృతి చెందాయి.
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా హైదరాబా దులో ఉన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా విషయాన్ని తెలుసుకున్నారు.వెంటనే ఫోన్ ద్వారా బాధిత రైతు దేశెట్టి వీరమల్లయ్య తో ఫోనులో మాట్లాడారు. బాధిత రైతుకు గా అండగా ఉండి ఆదుకుంటామని భరోసా కల్పించారు.
సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి పరిహారం అందజేయడానికి చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ అనుపమకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సం ఘటన స్థలానికి వెళ్లిన తాసిల్దార్ అనుపమ నివేదికను తయారుచేసి పంపించారు. ఈ మేరకు రూ. 64 వేల రూపాయల పరిహారం మంజూరు కాగా సోమవారం ఎమ్మెల్యే మే డిపల్లి సత్యం స్వయంగా బాధితుడు వీర మల్లయ్య ఇంటికి వెళ్లి పరిహారం చెక్కును అందజేశారు.
పిడుగుపాటుతో ఎడ్లు మరణించి నష్టపోయిన తనకు భరోసా ఇచ్చి, ఇచ్చిన హామీ మేరకు పరిహారం చెక్కును అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు బాధిత రైతు వీర మల్లయ్య కృతజ్ఞతలు తెలిపాడు.ఈ కార్యక్రమంలో మండల ఎమ్మా ర్వో అనుపమ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, సత్తు కనుకయ్య, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, వేముల భాస్కర్, వంగల శ్రీనివాస్, పానుగంటి స త్యం, తదితరులుపాల్గొన్నారు.