calender_icon.png 30 January, 2026 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఈడీ బాంబుల వెలికితీత

30-01-2026 01:59:28 AM

నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు 

చర్ల, జనవరి 29 (విజయక్రాంతి): చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు రెండు ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేశాయి. భద్ర తా బలగాలు నిర్వహించిన ఆపరేషన్‌లో 20, 30 కిలోల బరువున్న రెండు శక్తివంతమైన ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద వాహనాలను లక్ష్యంగా చేసుకోవడానికి లంకపల్లి మట్టి రోడ్డుపై ఐఈడీలను అమర్చారు. భద్రతా దళాలు వాటిని జాగ్రత్తగా ధ్వంసం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిం ది. మందుపాతర తొలగింపు ప్రక్రియలో, లంకపల్లి మట్టి రోడ్డు మధ్యలో అనుమానిత ఐఈడీ స్థలాన్ని బృందం కనుగొంది. పెద్ద వాహనాలను లక్ష్యంగా చేసుకోవడానికి పేలుడు పదార్థాలను దాచిపెట్టారు. బీడీఎస్ బృందం వాటిని అక్కడికక్కడే ధ్వంసం చేసిం ది. ఈ ఐఈడీ లను సకాలంలో కనుగొనకపోతే, పెద్ద నష్టం, తీవ్రమైన సంఘటన జరిగి ఉండేది.