28-10-2025 03:15:37 PM
సుక్మా: ఛత్తీస్గఢ్(Chhattisgarh) సుక్మా జిల్లాలో మావోయిస్టుల కుట్ర భగ్నం అయింది. సుక్మాలో భద్రతా దళాలు 40 కిలోల ఐఈడీని నిర్వీర్యం చేశాయి. భద్రతా దళాలకు హాని కలిగించే ఉద్దేశ్యంతో నక్సలైట్లు ఈ ఐఈడీని(IED) అమర్చారు. సంఘటనా స్థలం చుట్టూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భద్రతా దళాలకు ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు.