03-10-2024 02:26:23 AM
మహాత్మాగాంధీ జయంతిని బుధవారం గాంధీభవన్లో ఘనంగా నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, పార్టీ నాయకులు మహాత్ముడి విగ్రహానికి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అంతకుముందు పీసీసీ సేవాదల్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని, రెనోవా ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.