15-08-2025 06:57:07 PM
కాగజ్ నగర్,(విజయక్రాంతి): పారిశ్రామిక ప్రాంతమైన కాగజ్ నగర్ లో శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వార్డులు, ప్రభుత్వ కార్యాలయాలు, చౌరస్తాల్లో మువెన్నెల జెండా రెపరెపలాడింది. ప్రజా కార్యాలయంలో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వయ హరీష్ బాబు, బస్టాండ్ సమీపంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, సర్ సిల్క్ ఏరియాలో టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ జాతీయ జెండాలను ఎగరవేశారు.